మందు బాబుల‌కు గుడ్ న్యూస్.. వైన్స్ ప‌ని వేళ‌లు పెంపు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న మందు బాబుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌ద్యం దుకాణాల పని వేళ‌ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల జారీ తో గ‌తంలో కంటే ఒక గంట పాటు మ‌ద్యం దుకాణాలు తెరుచుకుని ఉండ‌నున్నాయి. అంటే రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు రాష్ట్రంలో బేవ‌రేజ‌స్ కార్పొరేష‌న్ మ‌ద్యం దుకాణాల ప‌ని వేళ‌లు ఉంటాయి.

కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు కానుంది. ప్ర‌తి రోజు రాత్రి 11 గంట‌ల నుంచి ఉదయం 5 గంట‌ల వ‌ర‌కు రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ ఉండ‌నుంది. అలాగే రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్య‌తో పాటు ప‌లు ఆంక్ష‌లను కూడా ఏపీ ప్ర‌భుత్వం విధించ నుంది. అయితే ఒక వైపు రాష్ట్రంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌టం.. దాన్ని నియంత్రించేందుకు నైట్ క‌ర్ఫ్యూ లు విధించ‌డం చేయ‌డంతో పాటు ఇలా మ‌ద్యం దుకాణాల ప‌ని వేళ‌లు కూడా పెంచ‌డం పై భిన్న అభిప్రాయాలు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news