IND VS PAK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్… !

-

ఈ రోజు ఎసీసీ ఎమర్జింగ్ మెన్ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా ఎ మరియు పాకిస్తాన్ ఎ జట్లకు మధ్యన మ్యాచ్ జరుగుతోంది. అందులో భాగంగా మొదటగా టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ హారిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో రెండు జట్లు కూడా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలుచుకుని గ్రూప్ బి నుండి పాయింట్ల పట్టికలో ఇండియా మరియు పాకిస్తాన్ లు వరుసగా మొదటి మరియు రెండవ స్థానాలలో ఉన్నారు. కాగా ఈ రోజు ఎవ్వరు గెలిస్తే వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంటారు. కాగా పాకిస్తాన్ లోనూ ఆయూబ్, హసీబుల్లా ఖాన్, మొహమ్మద్ హారిస్, కమ్రాన్ గులాం, సాహిబ్ జాదా ఫర్హాన్, కాశిమ్ అక్రమ్ లతో బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది.

 

ఇక ఇండియా తరపున సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, ధృవ్ జుర్ల్, యాష్ దుల్, రియాన్ పరాగ్ మరియు నిశాంత్ సింధు లతో బలంగానే ఉంది. మరి ఈ రెండు టీం లలో సత్తా ఉందొ లేదా తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news