ఇండియాలో తగ్గిన కరోనా… 24 గంటల్లో 18, 883 కేసులు

-

చైనా దేశంలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి… ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఉన్న మహమ్మారి మన దేశాన్ని కూడా వదలడం లేదు. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో దేశంలో 18, 833 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,46,687 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.43 శాతంగా ఉంది. ఇక తాజాగా కరోనా కేసులతో దేశం లో మొత్తం కేసుల సంఖ్య 33,87,1881 కు చేరింది. ఇక కేరళ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో 9,735 కరోనా కేసులు నమోదు కాగా… 151 మరణాలు నమోదు అయ్యాయి. కాగా… దేశం లో ప్రతి రోజూ 50 లక్షల కు పైగా వ్యాక్సిన్లను అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ…ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news