70 లక్షలకు చేరువలో కేసులు, 60 లక్షలకు చేరువలో రికవరీలు

-

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 70లక్షలకు చేరువయింది. గడిచిన 24 గంటల్లో 73వేల 272 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో 964 మంది వైరస్ కారణంగా చనిపోయారని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అలానే ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం కేసుల సంఖ్య 69లక్షల 79వేల 423గాఉంది. గడచిన 24 గంటల్లో 926 మంది చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షా 7వేల 416కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 8లక్షల 83,185గా ఉంది.

59లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 11,64,018గా ఉండగా ఇప్పటి దాకా 8.58 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,753గా ఉంది. దేశంలో 85.81 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.65 శాతంగా ఉన్నాయి. అలానే దేశంలో 1.54 శాతానికి మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news