కరోనా వేగం.. దూసుకుపోతున్న భారత్..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 27,114 కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీంతో ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,20,916కి చేరుకుంది. అలాగే మరో 519 మంది కరోనా కారణంగా మరణించగా మొత్తం మరణాల సంఖ్య 22,123 చేరుకుంది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,15,386 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా 2,83,407 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version