ఇండియాలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు.. కానీ అదే ఊరట !

-

భారత్ లో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతుంది అని భావిస్తూ వచ్చాం. ఎందుకంటే కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించినా ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 44,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 447 మంది మృతి చెందారు.


అలాగే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 42,156గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,14,579 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,79,216 గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,05,728 కి చేరింది. అలాగే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,29,635కి చేరింది. నిన్న ఒక్కరోజే 8,05,589 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 12,48,36,819 పరీక్షలు చేసినట్లు అయింది. అయితే రికవరీ రేటుతో పాటు దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువ కావడం ఊరట నిచ్చే అంశం అని చెప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news