దేశంలో తగ్గిన కరోనా : ఇవాళ కొత్తగా 14,146 కేసులు

-

మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్న 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా… ఇవాళ సంఖ్య 14 వేలకు పడిపోయింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా… 14,146 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,67,719 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,95,846 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 144 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,52,124 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,788 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 97,65,89,540 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 41,20,772 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,34,19,749 కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version