ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా 9216 కేసులు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ కూడా దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9216 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 99,976 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.35 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,612 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,40,45,666 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 125. 75 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు 64.46 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ. ఈ అటు కొత్త వేరియంట్ కలవరపెడుతున్న నేపధ్యంలో ఇండియాలో కరోనా కేసులు పెరగడం.. అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version