ఇండియాలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..24 గంటల్లో 2796 కరోనాతో మృతి !

-

ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,895 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,633,255 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 99,155 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 2796 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 473,326 కి చేరింది.

అయితే…బీహార్‌, కేరళ రాష్ట్రాల్లో గతంలో మరణాల సంఖ్యను ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. ఆ సంఖ్యను తాజాగా బులిటెన్‌ లో పేర్కొంది. అందుకే ఒక్క రోజులోనే మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6918 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3, 40,60,774 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,27,61,83,065 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1, 04,18, 707 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news