ఇండియాలో కొత్తగా 2827 కరోనా కేసులు, 24 మరణాలు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2827 నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,13,413 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3230 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.20 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 24 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,181 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,067 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,83,96,788 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14,85,292 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,70,165 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version