మళ్ళీ టాస్ ఓడిన ఇండియా … బలమైన జట్టుతో బ్యాటింగ్ చేయనున్న వెస్ట్ ఇండీస్ !

-

వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న ఇండియా జట్టు రెండు టైటిల్ లను గెలుచుకుని మూడవ టైటిల్ ను నెగ్గడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఈ రోజు నుండి అయిదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ మొదలు కానుంది, కాసేపటి క్రితమే టాస్ ఓడిపోయిన ఇండియా ఫీల్డింగ్ చేయనుంది. జట్టులోకి మొదటిసారిగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరియు ముఖేష్ కుమార్ లు అడుగుపెట్టారు. తమ కెరీర్ లో ఇదే తొలి టీ 20 మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటికే ముఖేష్ కుమార్ వన్ డే లు మరియు టెస్ట్ లలో ఆడగా ఇప్పుడు టీ 20 లలోనూ తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వెస్ట్ ఇండీస్ జట్టులోకి భయంకరమైన బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ వచ్చాడు..ఇతని రాకతో జట్టు ఇంకా బలంగా తయారయింది.

కాగా టీ 20 జట్టును రావ్ మాన్ పావెల్ ముందుండి నడిపించనున్నాడు. ఇక అయిదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి విజయం ఎవరు దక్కించుకోనున్నారో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news