డొమినికా టెస్ట్: టాస్ ఓడిన భారత్ … జట్టులోకి ఇద్దరు యువకెరటాలు !

-

ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్యన ఈ రోజు నుండి డొమినికా వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్ల ప్లేయర్లు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. సొంత వేదికల పైన ఆడుతుండడం వెస్ట్ ఇండీస్ కు కలిసొచ్చే అంశం అవనుంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ కెప్టెన్ కిర్క్ బ్రెత్ వెయిట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం రోహిత్ శర్మ టీం ను ప్రకటించగా… చాలా మంది ఊహించని విధంగా జట్టు కూర్పు ఉండడం ఆశ్చర్యపరిచింది. క్రికెట్ కెరీర్ లో భారత్ తరపున యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ మొదటి టెస్ట్ ను ఆడనున్నాడు. ఇతను రోహిత్ కు జతగా ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయనున్నాడు. ఇక గత మ్యాచ్ లకు కీపర్ గా ఉన్న తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్ ను టీం యాజమాన్యం తొలగించింది, ఇతని ప్లేస్ లో ఇషాన్ కిషన్ ను తీసుకుంది. ఇతనికి కెరీర్ లో ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం.

 

ఇక బౌలింగ్ లోనూ ఇద్దరు స్పిన్నర్ లతో బరిలోకి దిగుతోంది. పేసర్ లలో శార్దూల్ మరియు సిరాజ్ లతో పాటు జయదేవ్ ఉనాద్కట్ ను ఎంచుకుంది. మరి ఈ టీం తో మొదటి టెస్ట్ లో టీం ఇండియా విజయాన్ని అందుకుంటుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news