భార‌త్‌లో క‌రోనా కేసుల‌ తాజా లెక్క‌లివే..

-

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతోంది. ప్ర‌తీరోజు రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఒక్క‌రోజులోనే ఏకంగా 76,000 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,461,240కు చేరుకుంది. అలాగే.. ఒక్క‌రోజులోనే 1,019 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 62,713కు చేరుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక్క‌రోజులో ఏదేశంలోనూ ఇన్ని కేసులు న‌మోదు కాలేదు. దీంతో అమెరికా క‌న్న భార‌త్‌లో ప్ర‌స్తుతం ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఇక మ‌హారాష్ట్ర (747,995), త‌మిళ‌నాడు (409,238), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (403,616), క‌ర్నాట‌క‌ (318,000), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(213,824), ఢిల్లీలో 1,69,412 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా 24,888,299మంది వైర‌స్ బారిన‌ప‌డ‌గా 840,431మంది మ‌ర‌ణించారు. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 6,094,522 కేసులు, బ్రెజిల్‌లో 3,812,605కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news