తెలంగాణాలో ఏమాత్రం తగ్గని కరోనా.. మళ్ళీ 2751 కేసులు !

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం దాకా 1500 లోపే ఉండేవి కానీ టెస్ట్ లు పెంచడంతో ఇక్కడ కూడా భారీగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 2,751 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,20,166కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 9 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 808కు చేరింది.

corona
corona

ఇక ఇప్పటిదాకా కరోనా నుండి 89,350 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 1675 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 30,008 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 23,049 మంది హాస్పిటల్స్ లో కాక హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 62,300 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 12,66,643కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 432 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో కరీంనగర్ జిల్లా 192 కేసులతో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news