కోచ్ లేకుండానే ఐర్లాండ్ కు వెళ్లనున్న ఇండియా టీం !

-

టీం ఇండియా ఈ నెల 15వ తేదీన ఐర్లాండ్ తో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను ఆడడానికి బయలుదేరి వెళ్లనుంది. కాగా ఆగష్టు 18వ తేదీన డబ్లిన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్ లు కూడా అదే వేదికలలో ఆగష్టు 20 మరియు 23 తేదీలలో జరగనున్నాయి. ఈ టీం ను పేస్ బౌలర్ బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండియా టీం తో కోచ్ ఎవరూ వెళ్ళకపోవడం గమనార్హం. లక్ష్మణ్ NCA డైరెక్టర్ గా ఉన్నందున అతను వెళ్ళడానికి వీలులేకుండా పోయింది. ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మెయిన్ టీం తో అమెరికాలో వెస్ట్ ఇండీస్ సిరీస్ కోసం ఉన్నాడు.

అయితే మిగిలిన కోచ్ లుగా ఉన్న శీతాంశు కోటక్ మరియు సాయిరాజ్ బహుతులే లు మాత్రమే టీం తో వెళ్లనున్నారు. మరి కోచ్ ఎవరూ లేకుండా బుమ్రా సారధ్యంలో ఐర్లాండ్ ను చిత్తు చేసి టైటిల్ ను గెలుస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news