వైసీపీకి వ్యతిరేకంగా సర్వే … టీడీపీదే గెలుపట !

-

ఆంధ్రప్రదేశ్ లో లో జరగనున్న ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని ఎలాగైనా ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి టీడీపీ , జనసేన మరియు టీడీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ వైసీపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు మరియు ఇంటింటికీ అందచేస్తున్న ప్రతి సేవలే గెలిపిస్తాయని నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఒక సర్వే ఫలితం ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని తెలిపింది. ఇండియా టుడే మరియు సి ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వే లో లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం 3 నుండి 4 స్థానాలకు పరిమితం అవుతుందని, అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ 15 నుండి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది.

ఇక గత ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ స్థానాలు రాగా, టీడీపీకి కేవలం మూడు ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఈ అంచనాలు అన్నీ నిజం అవుతాయా ? లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news