IND vs WI : రెచ్చిపోయిన టీమిండియా.. చివరి టీ-20లోనూ విండీస్ చిత్తు

-

వెస్టిండీస్‌ తో చిట్ట చివరి అయిన ఐదో టీ 20 మ్యాచ్‌ లోనూ టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. అమెరికాలోని ఫోరిడాలో జరిగిన ఐదో టీ 20 లో టీమిండియా ఏకంగా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవరల్లో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్‌ ముందు ఉంచింది.

ఇక లక్ష్య ఛేధనకు దిగిన విండీస్‌ కేవలం 100 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 88 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 64 పరుగులు చేయగా.. దీపక్‌ హుడా 38 పరుగులు చేశాడు. ఇక అటు ఆల్‌ రౌండర్‌ 28 పరుగులు చేసి.. టీమిండియా భారీ స్కోర్‌ ను అందించారు. బౌలర్లలో అక్షర్ పటేల్‌ 3 వికెట్లు, రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు పడగొట్టి… శభాష్‌ అనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news