హుజురాబాద్‌ లో ఇందిరా శోభన్ బిగ్‌ షాక్‌

-

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్‌ నియోజక వర్గంలో ఇందిరా శోభన్ చేపట్టిన ఉపాధి భరోసా యాత్రకు బ్రేక్ పడింది. ఉపాధి పాదయాత్ర కు పర్మిషన్ లేదని చెప్పారు పోలీసులు. రెండు రోజుల క్రితమే పర్మిషన్ కోసం సీపీకి లెటర్ పెట్టింది ఇందిరా శోభన్. అయితే… మొదట పాదయాత్రకు ఒకే చెప్పిన పోలీసులు… ఆ తర్వాత మాట మార్చారు. దీంతో ఇందిరా శోభన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యం లో పోలీసులకు, ఇందిరా శోభన్ కు మధ్య వాగ్వివాదం కూడా జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇళ్లందకుంట మండలంలోని ఓ ఆలయం లోపల నిరసన తెలుపుతున్నారు ఇందిరా శోభన్. కాగా… ఇటీవలే ఇందిరా శోభన్.. వైఎస్‌ షర్మిల పెట్టిన కొత్త పార్టీ వైఎస్‌ఆర్టీపీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రజల అభిష్టం మేరకే తాను… వైఎస్‌ షర్మిల పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె వివరించారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్‌ లో ఉపాధి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news