హైదరాబాద్: కొత్తూరు సమీపం మేకగూడలో ఇంజినీర్డ్ స్టోన్, గ్రానైట్ ఉత్పత్తుల కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏడాదికి 9 మిలియన్ చదరపు అడుగుల ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.500 కోట్ల పెట్టుబడితో కంపెనీ నిర్మాణం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ చెప్పారు.