నగరంలో మరో పరువు హత్య..

-

ఈ మధ్య కాలంలో పరువు హత్యల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని తిరుమలగిరి టీచర్స్ కాలనీలో శనివారం రాత్రి పరువు హత్య జరిగింది. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నందకిషోర్ అనే వ్యక్తిని తన భార్య తరుపు బంధువులు దారుణంగా హతమార్చారు.

యువతి కుటుంబ సభ్యులకు ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య తరుచు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాత్రి నందకిషోర్ ను యువతి బంధువులు ఇంటికి పిలిచి మద్యం తాగించి.. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీశావంటూ వారు గొడవకు దిగడంతో మాటామాటా పెరిగి ఒకరినొకరు తోసుకోవడంతో .. నందకిషోర్ తలపై బండరాళ్లతో మోది..కర్రలతో కొట్టి చంపేశారు. హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. హత్యకు గురైన నందకిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీమార్చురీకి తరలించారు పోలీసులు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news