తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌..మార్చి 15 నుంచి ఇంటర్ ఒకేషనల్ ఎగ్జామ్స్

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌. ఇంటర్మీడియట్ ఒకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలు మార్చి 15న, సెకండియర్ పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి రెండు వరకు నిర్వహించనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ పరీక్షలు మార్చి 15 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4 వ వరకు జరుగనున్నాయి. ఈ విషయాన్ని రెండు రోజుల కిందట ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news