బాల్‌రెడ్డి వ‌ర్సెస్ శ‌శికుమార్‌… అత‌డినే పెళ్లాడ‌తా అన్న కీర్తి… పోలీసుల షాక్‌

-

హైదరాబాద్ శివార్ల‌లో క‌న్న‌తల్లి ర‌జిత‌(38)ను చంపిన కీర్తి రెడ్డి ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం డిగ్రీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోన్న కీర్తి మైన‌ర్‌గా ఉన్న‌ప్పుడే త‌న స్నేహితురాలు అన్న‌తో ప్రేమ‌ల‌లో ప‌డ‌డం… అత‌డితో హ‌ద్ద‌లు దాట‌డంతో ఆమె గ‌ర్భం దాల్చ‌డం జ‌రిగాయి. చివ‌ర‌కు అబార్ష‌న్ కోసం త‌న ఇంటి ప‌క్క‌న ఉన్న శ‌శికుమార్ సాయం తీసుకోవ‌డంతో అత‌డు ఈ బ‌ల‌హీన‌త ఆస‌ర‌గా చేసుకుని… ఇంటి ద‌గ్గ‌ర చెపుతాన‌ని కీర్తిని లొంగ‌దీసుకోవ‌డం… చివ‌ర‌కు అత‌డి మాయ‌లో ప‌డి త‌న క‌న్న‌త‌ల్లినే చంప‌డం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

చివ‌ర‌కు పోలీసులు కీర్తితో పాటు శ‌శికుమార్‌… ఆమె మైన‌ర్‌గా ఉన్న‌ప్పుడు గ‌ర్భం వ‌చ్చేందుకు కార‌ణమైన బాల్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఇక విచారణలో నేరాన్ని ఒప్పుకున్న కీర్తి రెడ్డి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉంది. తాజాగా ఆమె తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు బయటకొచ్చాయి. ఆమె చెప్పిన విష‌యాలు విని పోలీసులు సైతం షాక్ అయిన‌ట్టు తెలుస్తోంది.

తాను బాల్‌రెడ్డి వ‌ల్లే గ‌ర్భం దాల్చాన‌ని … అత‌డినే పెళ్లి చేసుకుంటానని చెప్పింద‌ట‌. ఆమె డిగ్రీ చ‌దువుతున్న టైంలోనే త‌న స్నేహితురాలి సోద‌రుడు అయిన బాల్‌రెడ్డి ప‌రిచ‌యం అయ్యాడు. వీరి పెళ్లికి పెద్ద‌లు కూడా ఓకే చెప్పారు. ఈ టైంలో బాల్‌రెడ్డి ఆమెను లోబరుచుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. మెడికల్ షాపులో కిట్ ద్వారా ప్రెగ్నెన్సీ క‌న్‌ఫార్మ్ చేసుకున్న ఆమెకు ఏం చేయాలో తెలియ‌లేదు.

చివ‌ర‌కు త‌న ఇంటి ప‌క్క‌న ఉండే అన్న‌య్య అని పిలిచే శ‌శికుమార్ సాయం కోరింది. అత‌డు త‌న‌కు సాయం చేస్తాడ‌ని ఆమె అనుకోగా… ఎప్ప‌టి నుంచో ఆమెపై క‌న్నేసిన శశి ఇదే అదనుగా భావించి శారీరక సంబంధానికి ఆమెను బలవంతపెట్టి చివరకు ఒప్పించాడు. చివ‌ర‌కు ఆమెకు అబార్ష‌న్ చేయించాడు. త‌ర్వాత వారిద్ద‌రు చాలా సార్లు శారీర‌కంగా క‌లుస్తూ వ‌చ్చారు. చాలాసార్లు శశి ఇంట్లోనే ఇద్దరు శారీరకంగా కలిశారు. ఈ క్ర‌మంలోనే శ‌శి డ‌బ్బుల కోసం డిమాండ్ చేయ‌డంతో పాటు త‌మ‌కు అడ్డు వ‌స్తున్న కీర్తి త‌ల్లిని చంపేందుకు కూడా వెనుకాడ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version