ముంబై పేలుళ్ళ ఉగ్రవాదికి షాక్ ఇచ్చిన పాక్… ఈ వయసులో…!

-

పాకిస్తాన్ కోర్టు గురువారం ముంబై ఉగ్రదాదుల సూత్రధారి, మరియు జమత్-ఉద్-దావా (జుడి) చీఫ్ హఫీజ్ సయీద్ కు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. లాహోర్‌ లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఎటిసి) కూడా హఫీజ్ సయీద్‌కు 2 లక్షల పాకిస్తాన్ రూపాయల జరిమానా విధించింది. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ తలకు… అమెరికా 10 మిలియన్ డాలర్లను ప్రకటించింది.

గత ఏడాది జూలై 17 న టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులలో అరెస్టు చేశారు. రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్రవాద నిరోధక కోర్టు అతనికి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నవంబర్‌లో సయీద్‌కు మరో రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో ఉగ్రవాద నిరోధక కోర్టు మరో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సయీద్ జైలు శిక్ష 36 ఏళ్ళకు పైగా ఉంది.

“లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఎటిసి) మరో ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో జమాత్-ఉద్-దావాకు చెందిన ఐదుగురు నాయకులకు 15 ఏళ్ళ శిక్ష విధించింది. హఫీజ్ సయీద్ లాహోర్ లోని కోట్ లఖ్పత్ జైలులో తన శిక్షా సమయాన్ని గడుపుతారని అధికారులు పేర్కొన్నారు. గురువారం కోర్టు దోషులుగా తేలిన మరో నలుగురు జుడి నాయకులు హఫీజ్ అబ్దుస్ సలాం, జాఫర్ ఇక్బాల్, జుడి ప్రతినిధి యాహ్యా ముజాహిద్, మహ్మద్ అష్రాఫ్ కు శిక్ష విధించారు. దోషులుగా తేలిన ప్రతి వ్యక్తికి 2, 00,000 జరిమానా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news