చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది దుర్మరణం

-

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలో ఐదంతస్తుల భవనంలో ఓ ప్రైవేటు బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం మంటలు చెలరేగాయి. రెండవ అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు అధికారులు. చైనా భారీ అగ్ని ప్రమాదాలకు కేంద్రంగా మారింది. హై రేంజ్ అపార్టుమెంట్ లో తరచుగా అగ్నిప్రమాదాలుగా జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో అన్యాంగ్ నగరంలోని ఓ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించి 38 మంది దుర్మరణం పాలయ్యారు. అంతకు ముందు ఏడాది అక్టోబర్ నెలలో షెన్ యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా.. 30 మంది గాయపడ్డారు. 2015లో టింజిన్ లోని రసాయన గోదాముల్లో జరిగిన వరుస పేలుళ్లలో 175 మంది చనిపోయారు. చైనాలోని బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలు తరుచు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version