మహిళల అణచివేతకు మరో నిర్ణయం.. అఫ్గాన్​లో బ్యూటీ సెలూన్లు బ్యాన్

-

అప్ఘాన్ లో మరోసారి తాలిబన్లు మహిళల స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. మహిళల అణిచివేతకు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించింది అక్కడి తాలిబన్ల ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మహిళల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం పట్ల దేశ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం లీడర్ హిబాతుల్లా అఖుంజాదా జారీ చేసిన జూన్ 24 నాటి ఉత్తర్వులను.. తాలిబన్ మంత్రి సిద్దిఖ్ అకిఫ్ మజహర్ ధ్రువీకరించారు.

అఫ్గాన్ రాజధాని నగరం కాబుల్​ సహా అన్ని ప్రాంతాల్లో సెలూన్లను మూసివేయడానికి ఒక నెల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నెల గడువు తర్వాత కచ్చితంగా సెలూన్లను మూసివేసి.. సంబంధిత నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని హెచ్చరించింది. కానీ బ్యాన్​కు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు. తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇలాంటి పరిమితులు మహిళల హక్కులు హరించడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై స్థానిక మహిళలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news