ఏపీ ప్రజలకు శుభవార్త.. బుందేల్‌ఖండ్ తరహా స్పెషల్ ప్యాకేజ్!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అవుతారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

ఇక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి నిధులపై అలాగే అభివృద్ధి అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చించనున్నారు. అయితే.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కేంద్ర సర్కార్..ఏపీకి శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి బుందేల్ ఖండ్ తరహా స్పెషల్ ప్యాకేజీ పై కేంద్రం నిర్ణయం తీసుకుందని టాక్. జగన్ పర్యటన నేపథ్యంలో.. దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందట. దీనిపై క్లారిటీ వస్తే.. ఏపీలో వెనుకబడ్డ.. జిల్లాల అభివృద్ధికి.. రూ.22 వేల కోట్లు అందే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news