చిలీలో కార్చిచ్చు.. 46 మంది మృతి.. 1100ఇళ్లు దగ్ధం

-

లాటిన్‌ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు విలయ తాండవం చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సెంట్రల్‌ చిలీ అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దీని వల్ల ఇప్పటికే ఆ దేశంలో 46 మంది మరణించినట్లు అక్కడి మంత్రి కరోలినా తోహా తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెంట్రల్‌ చిలీలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించినట్లు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియల్‌ బోరిక్‌ శనివారం వెల్లడించారు.

శుక్రవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు కార్చిచ్చు వల్ల 1,100 ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాంతాలైన వినా డెల్‌మార్‌, వాల్పరైజో ప్రాంతాల్లో మంటల తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపింది. దట్టమైన పొగ వ్యాపించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని పర్యాటకులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించడంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read more RELATED
Recommended to you

Latest news