వివేకానంద రెడ్డి హత్యపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

-

వివేకానంద రెడ్డి హత్యపై వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వారికి మాత్రమే శిక్ష పడాలా?, చేయించిన వారికి కూడా శిక్ష పడాలా?? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణ రాజు కోరారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారిని దస్తగిరి హత్య చేస్తే, అతన్నీ సునీతా రాజశేఖర్ రెడ్డి దంపతులు సమర్ధిస్తున్నారని సాక్షి దినపత్రిక తన వార్తా కథనంలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక వ్యక్తిని కత్తితో హత్య చేస్తే, శిక్ష కత్తికి పడాలా?, లేకపోతే పొడిచిన వ్యక్తికి పడాలా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు… ఇంకా ప్రజలని అమాయకులుగా భావిస్తూ సాక్షి దినపత్రిక అడ్డగోలు కథనాలు రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.

raghurama

దస్తగిరికి, వై.యస్. వివేకానంద రెడ్డి గారికి పాత కక్షలు ఏమీ లేవని, ఈ హత్యలో దస్తగిరిని కిరాయి హంతకుడి మాదిరిగా వాడుకున్నారని, ఈ హత్య గురించి కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారు, వై.యస్. భాస్కర్ రెడ్డి గారు దస్తగిరితో డీల్ మాట్లాడినట్లుగా సీబీఐ తన విచారణలో తేల్చిందని అన్నారు. గతంలో టీ కి కూడా డబ్బులు లేని దస్తగిరి ఇప్పుడు కార్లలో డ్రైవర్ ను పెట్టుకొని తిరగడానికి సునీత గారి దంపతులే ఆర్ధిక సహాయం చేస్తున్నారనే అపవాదు సాక్షి దినపత్రిక యాజమాన్యం మోపిందని, వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు గాను అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తంలో కొంత డబ్బులను చెప్పులు కుట్టే మున్నా వద్ద దాచానని గతంలో దస్తగిరి చెప్పారని, ఆ సొమ్మును సీబీఐ అధికారులు మున్నా అకౌంట్ నుంచి స్వాధీనం చేసుకున్నారని, ఇప్పుడు దస్తగిరిని పాత కేసులలో ఈ ప్రభుత్వం జైలులో వేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news