కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్‌.. డిఫెన్స్‌ చీఫ్‌తో పాటు 9 మంది మృతి

-

కెన్యాలో ఓ మిలిటరీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ దేశ డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ ఒమొండి ఒగొల్లా(61)తో పాటు తొమ్మిది మంది మిలిటరీ ఉన్నతాధికారులు మృతి చెందారు. రాజధాని నైరోబీ నుంచి 400 కి.మీ దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు.

కెన్యా స్థానిక కాలమానం ప్రకారం గురువారం రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు విలియం వెల్లడించారు. తీవ్ర విచారంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. ప్రమాద వార్త తెలియడంతో జాతీయ భద్రతా కౌన్సిల్‌తో అధ్యక్షుడు రూటో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రమాదానికి కారణాలపై విశ్లేషించారు.

ఈ ఘటనపై ఆరా తీయడానికి దేశ ఎయిర్‌ ఫోర్స్‌ బృందం ఘటనాస్థలికి చేరుకుంది.  ఈ ప్రమాదంతో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దేశంలో సంతాప దినాలు పాటించాలని అధ్యక్షుడు ప్రకటించారు. పరాక్రమవంతులైన జనరల్స్‌, గాలంట్‌ అధికారులు, సర్వీస్‌ మెన్‌, ఒక మహిళా అధికారిని మాతృభూమి కోల్పోయినట్లు రూటో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news