భారత విద్యార్థులకు శుభవార్త.. 30 వేల మందిని ఆహ్వానించిన ఫ్రాన్స్

-

విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రాన్స్ శుభవార్త చెప్పింది. 2030 నాటికి భారత్ నుంచి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పారిస్ ని సందర్శించిన దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఈ ప్రకటన చేయడం విశేషం.

ఎక్కువమంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల షార్ట్ స్టేజి వీసా తో సహా పలు చర్యలను ఫ్రాన్స్ రూపొందించింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలను భాగంగానే ఫ్రాన్స్ ఈ చర్యలను తీసుకుంది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రెసిడెంట్ మాత్రం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ప్రాన్స్ అధికారులు కృషి చేస్తున్నారు. సంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచస్థాయి విద్య అవకాశాలను భారతీయులతో పంచుకోవడానికి ఆసక్తిని ప్లాన్స్ కలిగి ఉంది భారతీయ
విద్యార్థులకు ప్రాన్స్ మంచి స్నేహితుల పని చేస్తుందని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ తెలిపారు.

ఫ్రాన్స్ విద్యా అవకాశాలు విద్యార్థులకు పరిచయం చేసేలా చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబైలో ఎడ్యుకేషన్ పేరుని కూడా నిర్వహించను అక్టోబర్లో జరగనున్న ఈ వేడుకకు దాదాపు 40 ఇన్స్టిట్యూట్లకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news