ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో అనేకమంది ప్రాణాలను కోల్పోయారు. ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఆ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.

ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేశారు. యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79.12 కు పెరిగి ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది. దీంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయని ఆందోళనలో మొదలయ్యాయి. ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయన్న కేంద్రమంత్రి ప్రకటన ఇచ్చినప్పటికీ యుద్ధం మరికొన్ని రోజుల పాటు కొనసాగితే భారతదేశంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.