కాలిఫోర్నియాలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. యాక్సిస్ బ్యాంక్‌ సీఈవో సహా ఆరుగురు మృతి

-

అమెరికా హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో  ఓ హెలికాప్టర్‌ రహదారిపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్‌లతో సహా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న మరో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ‘యాక్సెస్‌ బ్యాంక్‌’ సీఈవో హెర్బర్ట్ విగ్వే, నైజీరియాకు చెందిన ఎన్‌జీఎక్స్‌ గ్రూపు మాజీ ఛైర్మన్‌ అబింబోలా, ఇద్దరు పైలట్లు ఉన్నారు.

యాక్సిస్ సీఈవో హెర్బర్ట్‌ విగ్వే తన భార్య, కుమారుడు మరికొందరితో కలిసి యూరోకాప్టర్‌ ఈసీ 130లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా శాన్‌ బ్రెనార్డినో కౌంటీ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాదాపు 3,000 అడుగుల ఎత్తు నుంచి అది కుప్పకూలడంతో.. అందులో ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్థానిక అధికారులు తెలిపారు. సమీపంలోని ఐ-15 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదాన్ని గమనించి 911కు కాల్‌ చేశారని వెల్లడించారు.. ప్రమాదంపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది. ‘ఆఫ్రికా బ్యాంకింగ్‌ రంగానికి ఇది పెద్దషాక్‌’ అని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news