హిరోషిమాలో గాంధీ విగ్రహావిష్కరణ చేయనున్న మోదీ

-

జీ-7 సదస్సు కోసం ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ జపాన్‌ పయనమయ్యారు. హిరోషిమా పట్టణంలో జరుగుతోన్న ఈ సదస్సులో భారత్‌ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఉంది. భారత్‌ జీ-20కి అధ్యక్షత వహిస్తోన్న ఈ సమయంలో జీ-7 సదస్సులో పాల్గొనడం అర్థవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే జపాన్ వెళ్లే ముందు ప్రధాని మోదీ తన ట్విటర్ లో ఓ పోస్టు చేశారు.

‘హిరోషిమాలో జరుగుతోన్న జీ-7 సదస్సు కోసం జపాన్‌ బయలుదేరాను. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రపంచస్థాయి నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటానని తెలిపారు.

ఈ రోజు నుంచి మొత్తం ఆరు రోజుల పాటు మోదీ విదేశీ పర్యటనలో ఉంటారు. జపాన్‌ పర్యటనలో భాగంగా ఆయన హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అహింస ద్వారానే శాంతిని నెలకొల్పగలమని గాంధీ ప్రపంచానికి సందేశం ఇచ్చారు. ఇప్పుడు అణుభూమిలో శాంతి సందేశంగా గాంధీ విగ్రహం కొలువుతీరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news