Breaking : గూగుల్ కు షాక్ ! రూ.20,825 కోట్ల జ‌రిమానా

-

యూరోపియన్ యూనియ‌న్ గూగుల్ కు షాక్ ఇచ్చింది. గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్ (ఈయూ) కోర్టు భారీ జరిమానా విధించింది. బెల్జియం దేశంలోని బ్రసెల్స్ న‌గరంలో ఐటీ నిబంధనలు ఉల్లంఘించిన కార‌ణంగా గూగుల్‌కు రూ. 20,285 కోట్ల భారీ జరిమానా ను కోర్ట విధించింది. యూరోపియన్‌ యూనియన్ యాంటీ ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఈ భారీ మొత్తాన్ని గూగుల్ కు జ‌రిమానా గా విధించింది.

అయితే గూగుల్‌ చట్టవిరుద్దంగా ఇతర కంపెనీలకు మెరిట్‌లపై పోటీపడే అవకాశం తోపాటు కొత్త‌ ఆవిష్కరణలను నిరాకరించిందని అభియోగాలు ఉన్నాయి. అలాగే ఈ చ‌ర్య‌ యూరోపియన్ యూనియ‌న్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపుతుందని ఈయూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందు చేత గూగుల్ కు రూ. 20,825 కోట్ల భారీ జ‌రిమానా విధించిన‌ట్టు తెలుస్తుంది. అలాగే ఆ దేశం లో ఉన్న ఒక కంపెనీ వివరాలు సర్చ్‌ ఇంజన్‌లో స‌రి అయినా ప్రాముఖ్యత ఇవ్వ లేద‌ని కూడా అభియోగాలు ఉన్నాయి. ఇది ఐటీ నిబంధనలకు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని ఈయూ కోర్టు అభిప్రాయ ప‌డింది. దీంతో గూగుల్ కు జ‌రిమానా విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news