నా కూతురే రిషిని బ్రిటన్ ప్రధానిని చేసింది : సుధామూర్తి

-

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సమాజ సేవకురాలు సుధామూర్తి తన కుమార్తె అక్షతామూర్తి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అక్షతనే తన భర్త రిషి సునాక్​ను ప్రధాన మంత్రిని చేసిందని ఆమె అన్నారు. రిషి సునాక్‌ త్వరగా అధికారంలోకి వచ్చారని.. అయితే అది తన కుమార్తె వల్లే సాధ్యమైందంటూ వ్యాఖ్యలు చేశారు సుధామూర్తి.

“నేను నా భర్తను ఓ వ్యాపారవేత్తగా చేశాను. నా కుమార్తె తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది. కారణం భార్య మహిమలే. భర్తను ఓ భార్య ఎలా మార్చగలదో చూడండి.. నేను మాత్రం నా భర్తను మార్చలేకపోయాను. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేస్తే, నా కుమార్తె మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది” అని ఆమె అంటున్న వీడియో ఇన్​స్టాగ్రామ్​లో చక్కర్లు కొడుతోంది.

‘మా ఇంట్లో ఏది ప్రారంభించినా గురువారం రోజునే ప్రారంభిస్తాం. అది చూసి రిషి ఓ రోజు అక్షతను అడిగారు. ఎందుకలా.. అని. దానికి మా కూతురు మేం రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తామని చెప్పింది. అప్పటి నుంచి రిషి కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారు.’ అని ఈ వీడియోలో సుధామూర్తి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version