మార్చి 25.. ట్రంప్ లైఫ్ లో మళ్లీమళ్లీ రాని రోజు ఇది

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫేట్ ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫేట్ ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది.ఆయనకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించడమే గాక.. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి పూర్తవ్వడంతో ట్రంప్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లోని తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం దక్కించుకొన్నారు. తాజాగా అంచనాల ప్రకారం ట్రంప్‌ సంపద విలువ 4 బిలియన్‌ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరింది.

తన సంపద గురించి గతంలో అసత్యాలు చెప్పిన కేసులో దిగువ కోర్టు విధించిన రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్‌ అప్పీల్స్‌ కోర్టును ఇటీవల ఆశ్రయించారు. దిగువ కోర్టు ఉత్తర్వు అమలు కాకుండా నిలిపివేయటానికి పది రోజుల్లో రూ.1,460 కోట్ల(17.5కోట్ల డాలర్ల)ను చెల్లించాలని న్యాయస్థానం షరతు విధించింది.

అదే సమయంలో ట్రంప్‌నకు చెందిన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ సంస్థ డిజిటల్‌ వరల్డ్‌ అక్విజేషన్‌ కార్ప్‌ (డీడబ్ల్యూఏసీ)తో విలీనం ప్రక్రియ పూర్తయింది. మార్కెట్లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి 35శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ట్రంప్‌ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news