IPL 2021 : రాణించిన బెంగుళూరు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?

-

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ బిగ్ ఫైట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ షార్జాలో ని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు…పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్ నే పెట్టింది.

20 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. మొదట్లో ధాటిగా ఆడిన బెంగళూరు జట్టు… చివర్లో… కాస్త తడబడింది. విరాట్ కోహ్లీ 25 పరుగులు, పడిక్కల్ 40 పరుగులు, ఎబి డివిలియర్స్ 23 పరుగులు మరియు గ్రీన్ మాక్స్ వెల్ 57 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.

దీంతో 164 పరుగులు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. పంజాబ్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు మరియు హెన్రిక్స్ మూడు వికెట్లు తీసి.. రాయల్ చాలెంజర్స్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ గెలవాలంటే 165 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే పంజాబ్ బ్యాటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version