ఐపీఎల్ 2023: రాత్రి విజయంతో టాప్ 3 కు ఎగబాకిన ముంబై ఇండియన్స్ … !

-

గత రాత్రి ముంబై మరియు బెంగుళూరు మధ్య మ్యాచ్ లో రోహిత్ శర్మ టీం చేతిలో డుప్లిసిస్ సేన దారుణంగా ఓటమి పాలయింది. మాములుగా బెంగళూరు నిర్దేశించిన లక్ష్యం ముంబైకి సరిపోలేదు అని చెప్పాలి. ఎందుకంటే మూడు ఓవర్లు మరియు మూడు బంతులు మిగిలి ఉండగానే 200 పరుగుల టార్గెట్ ను ఉప్ మని ఊదేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 42 పరుగులు చేసి శుభారంభాన్ని అందించగా, సూర్య కుమార్ యాదవ్ (83)మరియు నెహాల్ వధేరాలు (52) మరో వికెట్ పడకుండా దాదాపుగా మ్యాచ్ ను ముగించారు. ఆఖర్లో సూర్య ఔట్ అయినా మ్యాచ్ ను గెలిపించాడు వధేరా. అలా ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో ముంబై ఒక్కసారిగా జాక్ పాట్ కొట్టినట్లు పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్ లలో రెండు గెలిచినా ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version