ఐపిఎల్ 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్…

-

ఐపిఎల్ లో తెలుగు ప్రజల జట్టుగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒకసారి మాత్రమే ఐపిఎల్ టైటిల్ ను గెలవగలిగింది. ఆ తర్వాత నుండి కెప్టెన్ లను మార్చినా .. జట్టులో ఆటగాళ్లను మార్చినా వారి రాత మాత్రం మారలేదు. అందుకే ఈసారి కెప్టెన్ ను మార్చి సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఎయిడన్ మార్ క్రామ్ ను నియమించింది.

కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సౌత్ ఆఫ్రికా మరియు నెదర్లాండ్ మధ్య సీరిస్ ఉంది. వన్ డే వరల్డ్ కప్ కు అర్హత సాధించాలంటే ఈ సీరీస్ చాలా కీలకం కావడంతో ఐపిఎల్ లో ఆరంభ మ్యాచ్ లకు మార్ క్రామ్ దూరం కానున్నాడు. ఇతని స్థానంలో అప్పటి వరకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మరి భువి నేతృత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లు గెలుస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news