IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా రేపు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 20 వ మ్యాచ్ అయితే ముంబైతో జరిగే మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆ మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండడని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. కానీ అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో వెల్లడించలేదు.ఇక ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ 71 పరుగులు మాత్రమే చేశారు. అటు బౌలింగ్లో కూడా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారు.

కాగా, రేపు సాయంత్రం ముంబైలోని వాంకేడే స్టేడియం వేదికగా 3: 30 pm కి ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్లు కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ మాత్రం ఆడిన అన్ని మ్యాచ్లు ఓటమి చవిచూసింది. ఇక రేపు జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news