IPL 2024 : రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

-

ఐపీఎల్ 2024 17వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రేపు మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్‌లో పోరాడి పరాజయం పాలైనప్పటికీ ఈసారి హోమ్ గ్రౌండ్ లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. దీంతో రేపటి మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలే సన్రైజర్స్ హోమ్ గ్రౌండ్ అంటేనే ఓ రేంజ్ లో ఆడుతుంది. అలాంటి వేదిక లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్….దీంతో రేపు హైదరాబాద్ దద్దరిల్లనుంది. ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఆరెంజ్ ఆర్మీ హవా సాగనుంది.దీనికోసం.. పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు.

అలాగే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఇప్పటికే తెలిపారు. దీంతో పాటుగా గతంలో వలె.. రాత్రి వరకు మెట్రో ప్రత్యేకమైన సర్వీసులను అందించనున్నారు. మరి మొదటి మ్యాచులో చివర్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంత గ్రౌండ్ గెలిచి తమ సెంటిమెంట్ ను కాపాడుకుంటుందా.. లేదో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news