సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడీయన్ మృతి

-

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్యనటుడు శేషు(60) గుండెపోటుతో కన్నుమూశారు. అయితే గత 10 రోజుల క్రితం హార్ట్ ఎటాక్తో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ తాజాగా మరణించారు.

ఈయన లొల్లు సభ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. శేషు ఇలామై, వేలాయుధం, A1, పారిస్ జయరాజ్, డిక్కీలోనా, గుల్ గుల్, బిల్డప్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన మొత్తం ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించారు. చివరగా, సంతానం హీరోగా వచ్చిన వడకుపట్టి రామస్వామి సినిమాలో నటించారు. ఇక శేషు భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నట్లు సమాచారం. శేషు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news