IPL 2024 : ఉత్కంఠ భరిత పోరులో విజయం సాధించిన కేకేఆర్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 223 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ జట్టు 221 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు ప్లేయర్లు జాక్స్(55), పటీదార్ (52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం దక్కలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో రస్సెల్ 3, హర్షిత్, నరైన్ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఈ ఓటమితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 222 పరుగుల భారీ స్కోరు చేసింది. కేకేఆర్కు ఓపెనర్ సాల్ట్ శుభారంభాన్ని ఇచ్చారు. 14 బంతుల్లోనే 48 రన్స్తో విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లే తర్వాత చకచకా వికెట్లు పడటంతో కెప్టెన్ అయ్యర్ 50 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. చివర్లో రమణ్ దీప్ 9 బంతుల్లో 24* రన్స్తో రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో గ్రీన్, యశ్ చెరో రెండు వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news