IPL 2024 : ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచులో రాజస్థాన్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. ఇక మొదటగా బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.ఇన్నింగ్స్ మొదటి నుంచీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు రన్స్ చేసేందుకు కష్టపడ్డారు.

రాజస్థాన్ ఓపెనర్స్ జోస్ బట్లర్ , జైశ్వాల్ తొలి వికెట్ కు 43 పరుగులు జోడించారు.జోస్ బట్లర్ 25 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగా,జైశ్వాల్ 21 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సామ్సన్ 19 బంతుల్లో 15 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.చివర్లో రియాన్ 47, జురెల్ 28 రన్స్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో సిమర్ జిత్ 3, తుషార్ 2 వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version