IPL 2024 : 78 ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించనున్న రాజస్థాన్ రాయల్స్… ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఫ్రాంచైజి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాను ఆడిన మ్యాచులో ఒక్కో సిక్సర్కు 6 ఇళ్ల చొప్పున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులో మొత్తం 13 సిక్సర్లు నమోదయ్యాయి.అంటే 78 ఇళ్లకు సౌర విద్యుత్ కల్పించనుంది.

కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు పొందింది. బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్ను 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. జాస్ బట్లర్ (100* పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్ (69 పరుగులు, 42 బంతుల్లో; 8×4, 2×6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.ఇక మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ సూపర్ సెంచరీ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12×4, 4×6)తో బెంగళూరుకు మంచి స్కోర్ కట్టబెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news