IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత నట్టికుమార్ అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ముగిశాయని.. గెలుపు, ఓటములనేది అంచనాలే అని ఆయన అన్నారు.గ్రౌండ్ రిపోర్ట్ తెలిసిన వాడిగా చెబుతున్నా.. ఉత్తరాంధ్రలో కూటమి భారీ మెజార్టీతో గెలవనుందని అన్నారు.

ఇంతకుముందెప్పుడు లేనివిధంగా జన్మభూమి మీద అభిమానంతో 70 లక్షల మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారని తెలిపారు. కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి ఈ అల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిందరికీ శాశ్వతంగా రెస్ట్ వస్తుందని అన్నారు. రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని..అవన్ని తాత్కాలికమేనని ,ఈ ఎన్నికల్లో అభివృద్ధి కావాలని ఓట్లేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news