తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ కి సంబంధించిన రెండు మ్యాచ్లను బీసీసీఐ రీ షెడ్యూల్ చేసింది. ఈ నెల 17న కోల్కతాలో జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ను ఒక రోజు ముందుగా నిర్వహించనుంది.ఈ నెల 16న ఇది జరగనుంది. ఈ మ్యాచ్ ఒక రోజు ముందుకు జరగడంతో ఈ నెల 16న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ అయింది. దీనిని ఈ నెల 17న నిర్వహించనున్నారు. కాగా శ్రీరామ నవమి సందర్భంగా మ్యాచ్కు భద్రత కల్పించలేమని బెంగాల్ పోలీసులు తెలపడంతో బీసీసీఐ మ్యాచ్ తేదీలు మార్చింది.
ఇదిలా ఉంటే… ఐపీఎల్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 1వ తేదీ) వరకు మొత్తం 14 మ్యాచ్లు విజయవంతంగా జరిగాయి. ఈ 14 మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా, ముంబై ఇండియన్స్ అత్యంత విఫలమైన జట్టుగా నిలిచింది.