IPL 2024 : రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మ..

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో రికార్డు అందుకున్నారు. ముంబై తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచారు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచులో 3 సిక్సర్లు బాది కీరన్ పొలార్డ్ (223 సిక్సర్లు)ను దాటేశారు. ఆ తర్వాత హార్దిక్ (104), ఇషాన్ కిషన్ (103), సూర్య (95) ఉన్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలో గేల్ అత్యధికంగా 357 సిక్సర్లు కొట్టగా, రోహిత్ 275 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

కాగా, మొదటగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 36 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 78 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజ్లో హర్డిక్ పాండ్య 8,తిలక్ వర్మ 25 పరుగులతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news