బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

-

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని అన్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోందని.. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండకపోవచ్చని సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలోకి ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదని ఆరోపించారు . వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు వామపక్షాలు కలిసిరావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోందని.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశా భావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news