IPL: గుజరాత్ టైటాన్స్‌ కి ఆశిష్ నెహ్రా గుడ్ బై..?

-

ఐపీఎల్ వచ్చే సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆ జట్టుకు గుడ్ బై చెప్పబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.గుజరాత్‌ అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ గెలవడంలోను, ఆ తర్వాతి సీజన్‌లోనూ ఫైనల్‌కు చేరడంతో ఆశిష్ నెహ్రా మాస్టర్ మైండ్‌గా గుర్తింపు పొందాడు. అయితే, వచ్చే సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్ తో కొనసాగేందుకు నెహ్రా సిద్ధంగా లేడని టాక్. గుజరాత్ టైటాన్స్‌తో విడిపోవాలని నెహ్రా నిర్ణయించుకున్నట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

నెహ్రా స్థానం కోసం ఫ్రాంచైజీ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో కూడా చర్చలు జరిపినట్టు తెలిపింది.ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి తప్పుకునే అవకాశం ఉందని ,యువరాజ్ సింగ్‌తో చర్చలు జరుగుతున్నాయి అని,ఇంకా ఏది నిర్ణయం కాలేదు కానీ, గుజరాత్ టైటాన్స్ కోచింగ్ స్టాఫ్‌లో కొన్ని మేజర్ మార్పులు జరగనున్నాయి.’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నెహ్రాతోపాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా గుజరాత్‌ను వీడనున్నట్టు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news